Nara Brahmani: శారీ రన్ ప్రారంభించడం ఆనందం కలిగించింది: నారా బ్రాహ్మణి

  • హైదరాబాదులో నిన్న శారీ రన్
  • నెక్లెస్ రోడ్ వద్ద జెండా ఊపి ప్రారంభించిన నారా బ్రాహ్మణి
  • ఆత్మవిశ్వాసంతో కూడిన మహిళలను కలుసుకున్నానని వెల్లడి
Nara Brahmani says she was delighted to flagged off Saree Run in Hyderabad

మహిళా సాధికారత సాధన లక్ష్యంగా హైదరాబాద్ లో నిన్న తనీరా శారీ రన్ నిర్వహించారు. మహిళలు చీరకట్టుతో ఈ పరుగులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి జెండా ఊపి ప్రారంభించారు. దీనిపై ఆమె ట్విట్టర్ లో స్పందించారు. 

నిన్న హైదరాబాదులోని నెక్లెస్ రోడ్ వద్ద తనీరా సంస్థ నిర్వహించిన శారీ రన్ ను ప్రారంభించానని వెల్లడించారు. ఈ సందర్భంగా వందలాది మంది ఆత్మవిశ్వాసంతో కూడిన మహిళలను, మహిళా కార్యసాధకులను కలుసుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని నారా బ్రాహ్మణి తెలిపారు. ప్రకాశవంతమైన, వివిధ రంగుల్లో, కళాత్మకంగా నేయబడిన చీరలు ధరించిన ఆ అతివలను ఈ పరుగులో పాల్గొన్నారని, తాను కూడా మంగళగిరి చేనేత చీరతో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి హాజరయ్యానని వివరించారు.

More Telugu News